
వినుకొండలో సోమవారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేస్తున్న ప్రచారం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. ఈ విధమైన వ్యాఖ్యలు హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు.సిబిఐ లేదా సిట్ నివేదికల్లో నెయ్యిలో కల్తీ నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రముఖ ప్రయోగశాలల్లో పరీక్షలు జరిగాయని పేర్కొంటూ, గత ప్రభుత్వాల కాలంలో నెయ్యి కొనుగోలు విధానాలపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు.నెయ్యిలో జంతు కొవ్వు లేదా ఇతర పదార్థాలు కలిస్తే వాసన ద్వారానే గుర్తించవచ్చని, డెయిరీ రంగంలో అనుభవం ఉన్నవారికి ఈ విషయం తెలియదా అని ఆయన వ్యాఖ్యానించారు.ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో పోలీసు చర్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.ఇక వినుకొండ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై కూడా బ్రహ్మనాయుడు ప్రశ్నలు లేవనెత్తారు. రైతుల కోసం నిర్మించిన కోల్డ్ స్టోరేజ్కు విద్యుత్ సరఫరా సమస్యలు, వ్యాపార వర్గాలకు గదుల నిర్మాణం నిలిచిపోవడం, జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు వంటి అంశాలను ప్రస్తావించారు.మున్సిపాలిటీలో నిధుల వినియోగం, ఇసుక-మట్టి తరలింపు, రైతులకు అవసరమైన వనరుల కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి తప్పుడు ప్రచారాలు నిలిపివేయాలని సూచించారు.








1 thought on “తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ ఆరోపణలు రాజకీయ లబ్ధికే : మాజీ ఎమ్మెల్యే బొల్లా”
Comments are closed.